AP Government: స్వాతంత్ర దినోత్సవం బంపరాఫర్.. ఆగస్ట్ 15 నుంచి మూడు పథకాలు అమలు!

1 year ago 49
ఏపీ ప్రజలకు టీడీపీ కూటమి ప్రభుత్వం బంపరాఫర్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఆగస్ట్ 15 స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మూడు పథకాలను అమలు చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అన్నా క్యాంటీన్ల ప్రారంభంపై ఇప్పటికే నిర్ణయం తీసుకోగా.. దీనితో పాటుగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం పథకాలను కూడా ఆ రోజు నుంచే ప్రారంభించాలనే యోచనలో ఏపీ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు త్వరలోనే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం హామీని అమలు చేస్తామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు.
Read Entire Article