Anantapur Wind Turbine: 150 అడుగుల నుంచి జారిన టెక్నీషియన్.. ఎలా కాపాడారో చూడండి

1 year ago 27
అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం నింబగల్లులో విండ్ పవర్ టర్బైన్ నుంచి జారిన ఉద్యోగిని తోటి సిబ్బంది, స్థానికులు కాపాడారు. నింబగల్లు వద్ద విండ్ పవర్ టర్బైన్‌ మెయింటైనెన్స్‌లో భాగంగా దాన్ని సర్వీస్‌ చేయడానికి సుందరేశ్ అనే టెక్నీషియన్ పైకి ఎక్కాడు. పైన గాలిమర రిపేర్ చేస్తుండగా ప్రమాదవశాత్తు అతడు కిందకు జారాడు. ఐరన్ రోప్ వేలో ఇరుక్కుపోయి, మధ్యలోనే ప్రమాదకరంగా వేలాడుతూ ఉండిపోయాడు. భూమి నుంచి దాదాపు 150 అడుగుల ఎత్తులో ఐరన్ సేఫ్టీ రోప్ సాయంతో తలకిందులుగా వేలాడాడు. గమనించిన తోటి సిబ్బంది అతడిని కిందకు దించే ప్రయత్నం చేస్తూనే అగ్నిమాపక అధికారులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక అధికారులు, విద్యుత్‌ ఉద్యోగులు అందరూ సమన్వయంతో సుందరేశ్‌ను కాపాడి ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దాదాపు రెండు గంటలపాటు ఐరన్ సేఫ్టీ రోప్‌తో వేలాడుతూ ఉండడంతో అతడి ఛాతి ఎముకలు దెబ్బతిన్నాయని, కాలు విరిగిందని డాక్టర్లు చెబుతున్నారు.
Read Entire Article