anakapalli: పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం.. లేబొరేటరీ నుంచి గ్యాస్ లీక్..

1 year ago 38
ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లాలో గ్యాస్ లీక్ ఘటన కలకలం రేపింది. అనకాపల్లి జిల్లాలోని పరవాడ ఫార్మాసిటీలోని ఠాగూర్ లేబొరేటరీలో హైడ్రోక్లోరిక్ ఆమ్లం లీకైంది. ఈ ఘటనలో ఓ కార్మికుడు చనిపోగా.. మరో 9 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిని సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అస్వస్థతకు గురైన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. మరోవైపు పరవాడ ఫార్మాసిటీ గ్యాస్ లీక్ ఘటనపై సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
Read Entire Article