వరంగల్ జిల్లాలో 800 ఏళ్ల నాటి శివాలయాన్ని కూల్చివేశారనే వార్తలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారానికి కారణం అయ్యాయి. స్కూల్ నిర్మాణం కోసం.. పురాతన శివుడి ఆలయాన్ని కూల్చివేసినట్లు వచ్చిన ఆరోపణలతో తీవ్ర నిరసనలు వ్యక్తం అయ్యాయి. ఈ వ్యవహారంపై కేసు కూడా నమోదు అయింది. అయితే ఈ ఘటనపై స్పందించిన జిల్లా కలెక్టర్.. అదే ప్రాంతంలో ఆలయాన్ని పునర్నిర్మిస్తామని హామీ ఇచ్చారు.