4 రాష్ట్రాల పోలీసుల వేట.. అనంతపురం పోలీసులకు చిక్కిన మోస్ట్ వాంటెడ్ ధార్ గ్యాంగ్..

1 year ago 33
అనంతపురంలో ఇటీవల జరిగిన భారీ దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. జనవరి 22న రియల్ ఎస్టేట్ వ్యాపారి వెంకటశివారెడ్డితో పాటుగా మరికొన్ని ఇళ్లల్లో దొంగతనం జరిగింది. పెళ్లి కోసం దాచుకున్న నగలను దొంగలు చోరీ చేశారు. సుమారు రూ.3.5 కోట్ల విలువైన బంగారం, వజ్రాలతో పాటుగా.. రూ.20 లక్షల నగదును దొంగతనం చేసినట్లు తెలిసింది. ఈ కేసును ఛాలెంజింగ్‌గా తీసుకున్న పోలీసులు.. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు జరిపారు. ఎట్టకేలకు చోరీకి పాల్పడిన దొంగల ముఠాను పట్టుకున్నారు. దొంగతనం చేసింది మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ ధార్ గ్యాంగ్‌గా పోలీసులు గుర్తించారు.
Read Entire Article