Ys Jagan About 2029 Elections Mavigun vs Amaravati: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ 2029 ఎన్నికలకు ఎజెండా ఫిక్స్ చేశారు. వచ్చే ఎన్నికలు మావిగన్ వర్సెస్ అమరావతి ఎజెండా మధ్య జరుగుతాయన్నారు. ప్రజలు ఎవరికి మద్దతిస్తారో తేల్చుకుందామంటూ జగన్ సవాల్ చేశారు. ‘మావిగన్’ పేరుతోనే ఎన్నికలకు వెళ్తామని.. ప్రజలిచ్చే తీర్పుకు తాము కట్టబుడి ఉంటామన్నారు. రాజధాని నిర్మాణంలో ఎలాంటి అవినీతికి తావు లేకుండా చూస్తామన్నారు.