హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రి అరుదైన మైలురాయిని అందుకుంది. నిమ్స్లో ఇప్పటివరకు 2 వేల కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు పూర్తి చేశారు. దీంతో దక్షిణ భారతదేశంలోనే తొలి ఆస్పత్రి కాగా.. మొత్తం దేశంలో మూడో ఆస్పత్రిగా అరుదైన రికార్డును దక్కించుకుంది. ఈ సందర్భంగా నిమ్స్ ఆస్పత్రి వైద్య బృందానికి సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఇందులో 95 శాతం ఆపరేషన్లను ఉచితంగా నిర్వహించినట్లు వెల్లడించారు.