దేశ అభివృద్ధి కోసం పనిచేస్తున్న ప్రధాని మోదీ.. కొంచెం తెలంగాణపై కూడా దృష్టి పెట్టాలని.. ఆయన ముందే సీఎం రేవంత్ రెడ్డి రిక్వెస్ట్ చేశారు. తెలంగాణ అభివృద్ధికి తాము చేస్తున్న ప్రయత్నానికి కేంద్ర ప్రభుత్వం సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికలు అయిపోయాయని.. అభివృద్ధే ఇప్పుడు ధ్యేయమని తేల్చి చెప్పారు. ప్రధాని మోదీపై తెలంగాణ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని.. కానీ తగిన ప్రాధాన్యం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.