అనంతపురం జిల్లాలోని రాయదుర్గం ప్రసన్న వెంకటరమణస్వామి ఆలయం ఓ వింత వివాహానికి వేదికగా మారింది. ఇక్కడ ఉన్న స్వామివారికి ఏటా.. బాలికతో వివాహం జరిపించటం ఆనవాయితీ. స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ తంతు జరిపిస్తారు. గత వందేళ్ల నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది కూడా 12 ఏళ్ల బాలికతో శ్రీవారి కళ్యాణం జరిపించారు. అయితే ఎందుకు ఇలా జరిపిస్తారనేదీ ఈ కథనంలో తెలుసుకుందాం.