10th class exams: పదో తరగతి పరీక్షా కేంద్రంలోకి పాము.. బయటకు పరుగులు తీసిన విద్యార్థులు

4 months ago 28
ఏపీవ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మొదలయ్యాయి. మార్చి 16 నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ వరకూ పది పరీక్షలు జరగనున్నాయి. సోమవారం ఉదయం 9 9: 30 గంటల నుంచి పరీక్షలు ప్రారంభమయ్యాయి. మరోవైపు పదో తరగతి పరీక్షల సందర్భంగా అక్కడక్కడా ఊహించని ఘటనలు జరిగాయి. వైఎస్ఆర్ కడప జిల్లా బి. కోడూరులో పరీక్షా హాలులోకి పాము ప్రవేశించటంతో విద్యార్థులు భయపడిపోయారు. భయంతో బయటకు పరుగులు తీశారు. అయితే సిబ్బంది పామును చంపేసి బయటకు విసిరేయటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Read Entire Article