హైదరాబాద్ బండ్లగూడలోని సల్కం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించిన ఫాతిమా ఒవైసీ విద్యాసంస్థకు ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేవని పాఠశాల విద్యాశాఖ హైకోర్టుకు తెలిపింది. అయితే అనుమతి లేని కాలేజీలో విద్యార్థుల నిర్వహణపై జస్టిస్ ఎన్వీ శ్రవణ్కుమార్ ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. భవన అనుమతులపై మూడు నెలలుగా జీహెచ్ఎంసీ స్పష్టత ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు.. వారం రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని, లేదంటే ఈనెల 9న అందుబాటులో ఉన్న సమాచారంతోనే తీర్పు ఇస్తామని హెచ్చరించింది.