నితీష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న ₹4000 కోట్ల భారీ బడ్జెట్ సినిమాగా 'రామాయణం' దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, యష్ రావణుడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తుండటంతో అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇటీవల విడుదలైన టీజర్ ‘ది ఇంట్రడక్షన్’ అభిమానులను, సినీ వర్గాలను ఆశ్చర్యపరిచింది. DNEG, హంస్ జిమ్మర్, ఏ.ఆర్. రెహమాన్, టెర్రీ నోటరీ వంటి టాప్ టెక్నికల్ టీమ్ ఈ చిత్రానికి పనిచేస్తుండటంతో ఇది భారతీయ సినిమా చరిత్రలో మైలురాయిగా నిలవనుంది.